నల్లి లక్ష్మణరావు యోగ క్షేమాలను తెలుసుకున్న బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నల్లి లక్ష్మణరావు కాలుకి గాయం తగిలి విశ్రాంతి తీసుకుంటున్న లక్ష్మణ్ ను శుక్రవారం రాజోలు నియోజకవర్గ నాయకులు రాజేశ్వరరావు బొంతు కలిసి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆయన వెంట గ్రామశాఖ అధ్యక్షులు తూతిక ఆదినారాయణ, జనసేన నాయకులు నామన నాగభూషణం, చల్ల రవి, శ్రీనివాస్, యేడిది రాము, నామన సూరినారాయణ, కొండేటి సత్తిబాబు, మేడిచర్ల అబ్బులు, ఏలూరి గణపతి తదితరులు పాల్గొన్నారు.