గుడివాడ జనసేన ఆధ్వర్యంలో 73వ గణతంత్ర వేడుకలు

గుడివాడ, గణతంత్ర దినోత్సవ సందర్భంగా గుడివాడ పట్టణ మున్సిపల్ హైస్కూల్లో జెండా ఆవిష్కరణ చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ(ఆర్ కె) మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా భారతం స్వతంత్ర సమరయోధులు అందరిని స్మరించుకుని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. అదే విధంగా జనసేన నాయకులు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పుణ్యఫలం పోరాట పటిమతో భరతభూమి స్వాతంత్రం సాధించిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా కులమతాలకు అతీతంగా మేధావుల ఆలోచనలతో రచించిన రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రేపటి తరాలకు తెలియజేయాలి. మనదేశంలో గాంధీజీని పూజిస్తారు, సుభాష్ చంద్రబోస్ నీ గౌరవిస్తారు, అంబేద్కర్ నీ గుండెల్లో పెట్టుకుంటారు, కానీ ఓటు మాత్రం నేరస్థులకే వేస్తున్నారు, దయచేసి ఇప్పటికైనా మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంటివారు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, చరణ్, అయ్యప్ప, కళ్యాణి, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ కరీం, గోపిక, సాయి మరియు జనసైనికులు పాల్గొన్నారు.