వంగవీటి రంగాకు నివాళులు అర్పించిన నరసరావుపేట జనసేన

నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్మిక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి ఇంచార్జి సయ్యద్ జిలాని. నాయకులు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా బడుగు బలహీన వర్గాలకు కూడు, గుడ్డ, నీడ అంటూ పాటుపడ్డారని.. విజయవాడ కృష్ణలంకలోని పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగాని కిరాతకంగా చంపేశారని. చంపేసి 33 సంవత్సరాలు అవుతున్న ఊరూరా ఆయన విగ్రహాలు పెట్టి అంజలి ఘటిస్తున్నారని. పేదల కోసం ఎంతో పాటు పడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జి ఎస్ ప్రసాద్, అద్దేపల్లి ఆనంద్ బాబు, ఆర్కే యాదవ్, వంశీ, ఈశ్వర్, బెల్లంకొండ అనిల్, నాగుల్ మీరా, నాజీరు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, బోనం జయరామ్, గుప్తా, శ్రీకాంత్, సాంబయ్య, మిరియాల సోము, రామారావు, పోతంశెట్టి రాము, యలమల కొండ, కొవ్వూరు నరసింహారావు, కృష్ణంశెట్టి గోవిందు, జూపల్లి కోటేశ్వరరావు, పుట్టా సాంబ, వెంకటేశ్వర్లు, ధనం కొండలు, నారదాసు వెంకటేశ్వరరావు, మేడిశెట్టి రామారావు, రామిశెట్టి రామకృష్ణ, నిమ్మిశెట్టి శ్రీను పాల్గొన్నారు.