నర్రా వారి గ్రామానికి రహదారి కావాలి.. కలెక్టర్ కు జనసేన వినతి పత్రం

కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, సోమరాజు పల్లి గ్రామపంచాయతీలో నర్రా వారి గ్రామానికి రహదారి కావాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వటం జరిగినది. అదేవిధంగా సింగరాయకొండ మండలం మూల గుంటపాడు గ్రామ పంచాయతీలో స్వర్ణ వెంకటేశ్వరరావు ఇంటి వద్ద నుండి రేగులగుంట పోవు కాలువను ఆక్రమణలు తొలగించి కాలువను నిర్మించాలని జిల్లా కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జరుగు మల్లీ మండల అధ్యక్షులు గూడా శశి భూషణ్, సింగరాయకొండ మండల ఉపాధ్యక్షులు సయ్యద్ జాన్ బాషా అధికార ప్రతినిధి సంకే నాగరాజు ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ కార్యదర్శి అనుముల శెట్టి కిరణ్ బాబు, కేశవరావు మరియు జనసైనికులు, వీరమహిళలు మరియు నర్రా వారి పాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.