జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

పార్వతీపురం: ఉమ్మడి విజయనగరం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం, బర్లి గ్రామంలో మండల అధ్యక్షుడు బంకురు పోలినాయుడు, మండల నాయకులు, బర్లి జనసైనికుల ఆధ్వర్యంలో జాతీయ రైతుదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కొంతమంది రైతులకు శాలువాలతో చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు జె ఎస్ పి మాట్లాడుతూ, 2024లో రాబోయేది మన రైతు ప్రభుత్వమే అని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా రైతాంగానికి పెద్దపీట వేస్తారని, ఇప్పుడు పడుతున్న కష్టాలన్నిటినీ పరిష్కరించి తీరుతారని, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఎంత అండగా నిలుస్తున్నారో అనే అంశాన్ని గుర్తు చేస్తూ, వారిలో భరోసాని నింపుతూ, రైతన్నలందరి ఆశీస్సులు మద్దతు పవన్ కళ్యాణ్ కి సంపూర్ణంగా అందివ్వాలని మనవి చేసారు. ఈ కార్యక్రమంలో బలిజిపేట మండల నాయకులు గంట్యేడ స్వామి నాయుడు, రగుమండ అప్పలనాయుడు, పరుచూరి రమణ, ఆది, ప్రగడ కళ్యాణ్, శ్రీను, పాలూరు వెంకటేష్ మరియు బర్లి జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.