దర్శి నియోజకవర్గంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు

  • 2వ రోజు పోటీలను ప్రారంభించిన జనసేన నాయకులు గరికపాటి వెంకట్

దర్శిలో జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో
2వ రోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ఆదివారం ప్రారంభమయ్యాయి. 6 పళ్ళ విభాగంలో ఈరోజు మొత్తం 21 జతలు వచ్చినవి. . ఈ పోటీలను దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట్, ఇంచార్జ్ బోటుకు రమేష్ ప్రారంభించారు, ముఖ్య అతిథిగా చల్లా వాసుదేవరావు ప్రజలతోటి ఎడ్ల పోటీలను తిలకించారు. దర్శి రోడ్డులో భారీ స్వాగత దొరణాలు ఏర్పాటు చేశారు. అదేవిదంగా నియోజకవర్గం పరిధిలోని ఎడ్ల బల ప్రదర్శను తిలకించడానికి వచ్చే ప్రేక్షకులు కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు లు చేశారు. ప్రాంగణం లో భారీ ఎల్. ఈ డి స్క్రీన్ లును ఏర్పాటు చేశారు. నియోజకవర్గం తో పాటు పలు జిల్లాలు నుండి పోటీలను తిలకించేందుకు రైతన్న లు వచ్చారు. ప్రాంగణం అంత టిడిపి, జనసేన, ఫ్లెక్సీ లు, జండాలు ను ఎర్పాటు చేశారు. పోటీలను తిలకించేందుకు మహిళాలు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. పోటీలను తిలకించిటానికి వచ్చిన మహిళా లకు ప్రత్యేక గ్యాలరీ ని ఏర్పాటు చేశారు. దర్శికి వారం రోజులు ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని అన్నదాతలు అంటున్నారు. అలాగే 6 పళ్ళ ఎడ్ల ప్రదర్శనలో గెలుపొందిన వారికి బహుమతులు జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఇవ్వడం జరిగింది.