దీపికా మేనేజర్కు ఎన్సీబీ సమన్లు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాశ్కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. బాలీవుడ్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసును ఎన్సీబీ అధికారులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్సీబీ చేసిన సోదాల్లో దీపికా పదుకొనె మేనేజర్ ఇంట్లో డ్రగ్స్ దొరికిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కరిష్మా ప్రకాశ్ను విచారించాలని ఎన్సీబీ భావిస్తుంది. అయితే నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అధికారులకు దీపికా మేనేజర్ జాడ కనిపిండం లేదు. దీంతో అధికారులు వారి ఇంటి వద్ద నోటీసులు అంటిచారట.