తెలంగాణ జనసేన కార్యనిర్వాహకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని 32 నియోజకవర్గాల జనసేన పార్టీ కార్య నిర్వాహకులతో రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నియమించిన 32 నియోజకవర్గాల కార్యనివాహకులతో టెలికాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడి దిశా నిర్దేశం మరియు కార్యాచరణకు సంబంధించిన సూచనలు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చేయడం జరిగింది.