ఈ నెల 31న తదుపరి జనవాణి

జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ఒక వారం వాయిదా పడిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం వైరల్ జ్వరానికి గురయ్యారు. పార్టీ అధ్యక్షులతోపాటు కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యానికి గురయ్యారు. అందువల్ల వచ్చే ఆదివారం అంటే ఈ నెల 24 న కాకుండా 31వ తేదీన జనవాణి జరుగుతుంది. స్థలం, వేదిక వివరాలను త్వరలోనే తెలియచేయగలం. ఇప్పటికే విజయవాడ, భీమవరంలలో మూడు విడతల జనవాణి కార్యక్రమాలు పూర్తయిన విషయం విదితమే. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మిగిలిన రెండు కార్యక్రమాలు జరుగుతాయి అని నాదెండ్ల మనోహర్ వివరించారు.