కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

  • రఘుదేవపురం గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం
  • అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు అందరిపై ఉండి అందరూ సుఖసంతోషాలతో ఉండాలి.. బత్తుల

సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో జరిగిన కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కమిటీ వారి ఆహ్వానం మేరకు జాతరలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని అమ్మవారిని దర్శించి, అన్న సమారాధన కార్యక్రమంలో తీర్థప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ.. కార్యక్రమ నిర్వహణ నిమిత్తం 5,000/- రూపాయల విరాళాన్ని కమిటీ వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, నాగారపు సత్తిబాబు, మామిడాల సుబ్రహ్మణ్యం, దాసరి రమేష్, పల్లపళ్ల లోవరాజు, కంబాల నాగేంద్ర, వాతాడ సత్తిబాబు, విరోధుల రాంప్రసాద్, బొబ్బిరెడ్డి సూరిబాబు, కవల గంగాధర్, వీరమహిళ సూర్యావతి, సుర్రెడ్డి మణికంఠ, యర్రంశెట్టి పొలారావు తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.