పాలకొండ జనసేన, టీడీపీ కర్తగా నిమ్మల నిబ్రమ్

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం, జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గం సమన్వయ కర్తగా గిరిజన నేత, మాజీ జడ్పీటీసీ, జనసేన నాయకుడు నిమ్మల నిబ్రమ్ ని నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ లకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపరు. పాలకొండ నియోజక వర్గంలో (ఎస్టీ సవర) కులానికి చెందిన గిరిజన నేత నిమ్మల నిబ్రమ్ ని నియమించడంతో నియోజకవర్గంలో అత్యధిక శాతం సవరలు ఉన్నపటికీ ఇంతవరకు ఎ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదని, జనసేన పార్టీ ఆ స్థానం ఇచ్చిందని అదేవిధంగా నియోజక వర్గం లో అన్ని వర్గాలను కలుపుకొని జనసేన పార్టీని మరింత పటిష్టపరిచేందుకు కృషి చేస్తామని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స. పుండరీకం తెలిపారు. అదేవిధంగా జనసేన పార్టీ – తెలుగుదేశం పార్టీ ల నాయకులను, కార్యకర్తలను, అభిమానులు సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి కార్యాచరణ ని, మ్యానిఫెస్టోని ప్రజలలోకి తీసుకువెళ్తామని, రాబోయే ఎన్నికల్లో పాలకొండ నియోజక వర్గం లో ఉమ్మడి అభ్యర్థి ని గెలిపిస్తామని తెలిపారు. జనసేన పార్టీ క్రియా శీలక సభ్యులు బి.పి.నాయుడు, కర్ణేన సాయి పవన్, జనసేన జాని, దండేల సతీష్, వావిలిపల్లి చిన్న, చరణ్, పండు, దత్తి గోపాల్, చింత గోవర్ధన్ తదితరులు జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ బాద్యుడు గా నిమ్మల నిబ్రమ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.