నొ మై కాన్స్టిట్యూఎన్సీ 52వ రోజు

శ్రీకాళహస్తి: నొ మై కాన్స్టిట్యూఎన్సీ 52 వ రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం లోని ప్రాజెక్ట్ వీధిలో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కొన్ని సమస్యలు వినుత దృష్టికి ప్రజలు తెలిపారు. ప్రధానమైన సమస్యలు త్రాగు నీరు సమస్య, సీ సీ రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు (మొండి పోల్స్ మాత్రమే ఉన్నాయి), డ్రైనేజ్ కాలువలు లేవని ప్రజలు వినుత దృష్టికి తెలియజేశారు. మా వీధి మునిసిపాలిటీ లో ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోని పాపాన పోలేదని ప్రజలు వాపోయారు. సమస్యలు మునిసిపల్ కమీషనర్, జిల్లా కలెక్టర్ గారి గృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకి వినుత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్, నితీష్ కుమార్, వెంకటరమణ యాదవ్, గిరీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.