నొ మై కాన్స్టిట్యూఎన్సీ.. శ్రీరామ్ నగర్ కాలనీలో వినుత కోటా పర్యటన

  • నొ మై కాన్స్టిట్యూఎన్సీ 48వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: నొ మై కాన్స్టిట్యూఎన్సీ 48వ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం లోని శ్రీరామ్ నగర్ కాలనీలోని వీధుల్లో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి, జనసేన పార్టీకి ఒక్క అవకాశం కల్పించాలని ప్రజలను కోరడం జరిగింది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నియోజకవర్గంలో, రాష్ట్రంలో జనసేన పార్టీ ముందుండి పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలలో ఏ మాత్రం మెరుగు లేదని ప్రజలు తెలియజేశారు. సమస్య ఉంది అని చెప్పడానికి కూడా ఏ కేసులు పెడతారో అని భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోయారు. అన్ని రేట్లు పెంచి, సంక్షేమం పేరుతో కొద్ది మందికి మాత్రమే మేలు చేసే కార్యక్రమాలు మాత్రమే ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఏ మాత్రం అభివృద్ది లేదని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు వెంకటరమణ, నితీష్ కుమార్, తులసి రామ్, జనసైనికులు ఉదయ్, కపిల్, వినోద్, మునిరాజ తదితరులు పాల్గొన్నారు.