SBI లో 2000 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
దేశంలోనే అగ్రగామి బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్సబీఐ) రెండు వేల ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేటగిరీల వారీగా
జనరల్- 810
ఎస్సీ-300
ఎస్టీ-150
ఓబీసీ-540
ఈడబ్ల్యూఎస్- 20
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు సైతం అర్హులే.
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు రిజర్వ్డ్ కేటగిరీలకు సడలింపు ఉంటుంది. మూడంచెల విధానంలో… ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామిషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష ఫీజు: రూ.750 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చారు.
దరఖాస్తు ఆఖరు తేదీ: డిసెంబరు4,2020
దరఖాస్తు విధానం: గడువు తేదీలోపు https://bank.sbi/carrers, https://www.sbi.co.in/carrer ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఏడాది డిసెంబరు 31, వచ్చే ఏడాది జనవరి 2, 4, 5 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. ఇందులో మెరిట్ ఆధారంగా జనవరి 29న జరిగే మెయిన్ పరీక్షకు అభ్యర్థులను అనుమతిస్తారు.
ఫిబ్రవరి లేదా మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా మార్చి నెలాఖరులో అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేస్తారు.