SBI లో 2000 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

దేశంలోనే అగ్రగామి బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) రెండు వేల ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కేటగిరీల వారీగా

జనరల్‌- 810

ఎస్సీ-300

ఎస్టీ-150

ఓబీసీ-540

 ఈడబ్ల్యూఎస్‌- 20

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం లేదా ఫైనల్‌ సెమిస్టర్‌ చదువుతున్న వారు సైతం అర్హులే.

వయోపరిమితి:  21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: నిబంధనల మేరకు రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు సడలింపు ఉంటుంది. మూడంచెల విధానంలో… ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామిషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

పరీక్ష ఫీజు: రూ.750 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చారు.

దరఖాస్తు ఆఖరు తేదీ: డిసెంబరు4,2020 

దరఖాస్తు విధానం: గడువు తేదీలోపు https://bank.sbi/carrers, https://www.sbi.co.in/carrer ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 ఈ ఏడాది డిసెంబరు 31, వచ్చే ఏడాది జనవరి 2, 4, 5 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. ఇందులో మెరిట్‌ ఆధారంగా జనవరి 29న జరిగే మెయిన్‌ పరీక్షకు అభ్యర్థులను అనుమతిస్తారు.

ఫిబ్రవరి లేదా మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా మార్చి నెలాఖరులో అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేస్తారు.