బండారు రాజు ఆధ్వర్యంలో నూజివీడు జనసేనలో చేరిక

  • పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేనలో చేరుతున్నం – ముస్లిం అజాద్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్
  • ముస్లిం సోదరులు అందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి శివరామకృష్ణ

నూజివీడు, నూజివీడు టౌన్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్సీపీ నుండి కొంత మంది జనసేన పార్టీలో చెరడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ – జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణ గురించి శనివారం పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ వివరాలను, కార్యాచరణను మన ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ వివరించడం జరిగింది. టీడీపీ జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో మరియు కార్యక్రమాలు ఎలా చేయాలో తెలిపారు. ముస్లిం మైనారిటీ సోదరులు ఆంద్రప్రదేశ్ ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్, (21వ వార్డ్) మహమ్మద్ జానీ బాషా(19వ వార్డ్) షేక్ ఆసిన్, (4వ వార్డ్) షేక్ రియన్ ఖాన్, (19 వ వార్డ్) తొదుర్తి గణేష్ (8వ వార్డ్) బి సాయిరాం ఆకాష్ నాయుడు(10వ వార్డ్) సాయిరాం (8వ వార్డ్) మరియు ఇతరులు జనసేన పార్టీలోకి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరిని ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ నూజివీడు నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ బండారు రాజు జక్కుల లక్ష్మీ జనసేన కండువాలు వేసి జనసేన లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పార్టీలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకు వెళతాం అని ముస్లిం సోదరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి తేజస్విని, తాళం చెన్నారావు షేక్ అన్వర్, బి.శ్రీకాంత్ మరియు నూజివీడు జనసైనికులు పాల్గొన్నారు.