మహా సముద్రం స్టొరీ లైన్ లీక్

ఆర్.ఎక్స్‌.100’తో విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా రాబోతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. శర్వా తో పాటు ఈ మూవీలో మరో హీరోగా సిద్దార్థ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ కథ లీక్ అయ్యింది.

చిన్నప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు కొన్ని కారణాల వల్ల ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటారు. ఆ ద్వేషం కాస్త పెరిగి పెద్ద అయ్యాక పగగా మారుతుంది. వారిద్దరి మధ్య భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉంటుంది అంటున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా లో శర్వా నటన మరో లెవల్ లో ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.