ఏపీ లో కొనసాగుతున్న బంద్…డిపోలకే పరిమితమైన బస్సులు

విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు ఏపి వ్యాప్తగా బంద్ ను నిర్వహిస్తున్నారు. ఈ బంద్ కు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. అధికార వైసీపీ కూడా ఈ బంద్ కు మద్దతు తెలపడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సులు డిపోలకే పరిమితం అవుతాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతున్నది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఇక బంద్ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు.