పూతలపట్టు జనసేన ఆధ్వర్యంలో మన ఊరు మనసేన

జనసేన పార్టీ చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం: తవణంపల్లి మండలం, వడ్డుపల్లి పంచాయతీలో స్థానిక మండల అధ్యక్షులు రాజశేఖర్, ఉపాధ్యక్షులు పూర్ణచంద్ర ఆధ్వర్యంలో “మన ఊరు మనసేన” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ వడ్డుపల్లి గ్రామం నుండి సుమారు 30 మందిని పార్టీలోకి ఆహ్వానించి, ప్రజల పక్షాన పోరాడుతూ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే విధంగా అడుగులు వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తవనంపల్లి మండల కార్యదర్శులు, రాజశేఖర్, విగ్నేష్ మరియు ఐరాల మండలం ఉపాధ్యక్షులు సానే నవీన్, మండల ప్రధాన కార్యదర్శి తులసి బాబు నాయకులు తులసి, శ్రీకాంత్ మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.