పీఏసీ సభ్యులు నాగబాబుతో డా. విశ్వక్సేన్ భేటీ

ఎచ్చెర్ల: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు ఎచ్చెర్ల నియోజకవర్గం ఇంచార్జ్ డా. విశ్వక్సేన్ తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని నాయకుడు నిర్ణయమే మా నిర్ణయంగా పార్టీ కోసం కుటుంబం మెత్తం కష్టపడతాము విశ్వక్సేన్ తెలియజేయడం జరిగింది. నాగబాబుగారు స్పందిస్తూ రానున్న రోజుల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీల సముచిత స్థానం కల్పిస్తామని ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఎచ్చెర్ల ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలి అని, ఉత్తరాంధ్రలో ఒక మంచి నాయకుడిగా మీ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందని నాగబాబు డా విష్వక్సేన్ కు భరోసా ఇవ్వడం జరిగింది.