పాలకొండలో పవన్ కళ్యాణ్ ఫొటొకు పాలాభిషేకం

పాలకొండ నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వాలింటీర్లచే వైసీపి నాయకులు చేయించిన నిరసనలను ఖండిస్తూ.. పాలకొండ నియోజకవర్గంలో పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని పాలకొండ జనసైనికులు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో మూడు వేలమంది కౌలు రైతులు చనిపోతే పట్టించుకోని వైస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ కారణంగా పవన్ కళ్యాణ్ గారినే రాష్ట్ర ప్రజలు కోసం తన సొంత డబ్బులు 30 కోట్లతో హా కుటుంబాలును ఆదుకున్న కారణంగా అలానే జనసేన క్రియశీలక సభ్యత్వం తీసుకున్న కుటుంబంలో ప్రమాదంతో మరణించిన కుటుంబాలుకి 5లక్షలు చొప్పున తన సొంత డబ్బులు ఇచ్చినటువంటి గొప్ప ప్రజా నేత పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చెయ్యడం జరిగిందని తెలిపారు.