నందిగామ గ్రామంలో రామ్ సుధీర్ పర్యటన

పెడన: పెడన మండలం, నందిగామ గ్రామంలో శనివారం పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా నందిగామ గ్రామస్థులు, జనసేన నాయకులు క్రోవి సుందర రాజు ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో శనివారం నందిగామలోని వారి నివాసంలో రామ్ సుధీర్ సుందర రాజును పరామర్శించారు. అనంతరం క్యాన్సర్ బారిన పడి శస్త్ర చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన నందిగామ దళితవాడకు చెందిన బొడ్డు అమలేశ్వరరావు కుమార్తెను రామ్ సుధీర్ పరామర్శించారు. అనంతరం నందిగామ దళితవాడలో నూతనంగా నిర్మిస్తున్న చర్చ్ ను గ్రామస్థుల ఆహ్వానం మేరకు యడ్లపల్లి రామ్ సుధీర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్లేటి దుర్గారావు, రాజుల పాటి సత్యనారాయణ, క్రోవి రామ సుబ్బారావు, క్రోవి రామ కృష్ణ, చింతల మహంకాళ రావు, తోట సూర్య చంద్రరావు, యర్రంశెట్టి రామాంజనేయులు, యర్రంశెట్టి సతీష్, మేక రఘు, బత్తుల మోహన్, క్రోవి కొండల రావు, ఇమ్మనుయెలు, బొడ్డు అమలేశ్వర రావు, బోయిన ఉదయభాస్కర్ రావు, దొండపాటి శ్రీనివాస రావు, సింగంశెట్టి అశోక్ కుమార్, బంటుమిల్లి ఉపాధ్యక్షుడు గోట్రు రవి కిరణ్, దివి శ్రీనివాస్, సయ్యద్ షఫీ, వరుధు రాము, వంగవీటి చైతన్య, పెన్నేరు మణికంఠ, గడ్డిగోపుల నాగ, కొఠారి మల్లి బాబు, బాకీ నాని, నందం శివ స్వామి, పవన్, సాయి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.