వీరనారి ఝాన్సి లక్ష్మిబాయికి పాలకొల్లు జనసేన వీరమహిళల ఘననివాళులు

పాలకొల్లు నియోజకవర్గం వీర మహిళా విభాగం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి194వ జయంతి సందర్భంగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఋఇయ మాట్లాడుతూ.. దేశ ప్రజలపై తెల్లదొరల దమనకాండకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం సాగించి ఆత్మార్పణం చేసిన దిశాలి ఝాన్సీ రాణి అని తెలుపుతూ పవన్ కళ్యాణ్ మహిళా సాధికారతకు, రాజకీయాలలో మహిళల ప్రాధాన్యతకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయని, మహిళలకు రక్షణ కరువైందని ప్రభుత్వంలో మహిళలు అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని, మహిళా సాధికారత పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని, జనసేనపార్టీ వీర మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రియా, భవాని, పద్మజ, షేక్ వల్లియా, ఝాన్సీ, పార్వతి పాల్గొన్నారు.