వీరనారి ఝాన్సి లక్ష్మిబాయి జయంతి

హైదరాబాద్: వీరనారి ఝాన్సి లక్ష్మీ భాయ్ 194వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నందు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఝాన్సి లక్ష్మీ భాయ్ చిత్రపటానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. ఆమె స్ఫూర్తిని మన పార్టీ వీర మహిళలు పుణికి పుచ్చుకోవాలని పవన్ అన్నారు. అనంతరం అమలాపురంపార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ డి ఎమ్ ఆర్ శేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళనాగ సతీష్, సలాది రమణ, ఆర్.డి.యస్.ప్రసాద్, వాకపల్లి వేంకటేశ్వర రావు, పోలిశెట్టి కన్నా, నల్లా వేంకటేశ్వర రావు, అల్లాడ రవి, సత్తి చిన్నా, జంగా లోవరాజు, నిమ్మకాయల సాయి, పెదమల్లు మణికంఠ తదితరులు కూడా అంజలి ఘటించారు.