జనసైనికుడు మధుని పరామర్శించిన పాలకొండ జనసైనికులు

పాలకొండ నియోజకవర్గంలో బాసురు గ్రామానికి చెందిన జనసైనికుడు ఎస్ మధు కొన్ని రోజులు క్రితం పెయింటింగ్ చేస్తూ భవనంపై నుంచి పడిపోవడం జరిగింది. పాలకొండ ప్రభుత్వ హాస్పిటల్ లో చేరిన విషయం తెలుసుకొని పాలకొండ జనసైనికులు వారడ శ్రీను, పోరెడ్డీ ప్రశాంత్, పొట్నురు రమేష్, జామి అనిల్ వెళ్లి పరామర్శించడం జరిగింది. తనకు మెరుగైన ట్రీట్మెంట్ అందే విధంగా చూడాలని డాక్టర్ ని కోరడం జరిగింది. మధుకి జనసేన పార్టీ తరుపున అన్నివేళలా తోడు ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.