కొత్తపల్లి జనసేన యువత ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ

తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం కొత్తపల్లి జనసేన యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన రావు (గాంధీ), జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు దాసరి రాము విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకటకృష్ణారావు, వట్టి కొండ కృష్ణ, గాదె వారి గూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు, విసన్నపేట మండల పార్టీ అధ్యక్షులు షేక్ యాసీన్, నందమూరి వెంకటేశ్వరరావు, బిల్లా నారాయణ, కస్తూరి రామస్వామి, అడపా శ్రీను, గూడవల్లి నరసింహారావు, మైలవరం మండల పార్టీ అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, కొత్తపల్లి గ్రామ జనసేన యువత పుప్పాల వీరబాబు, నాగవరపు ఆంజనేయులు, పుప్పాల శివరామకృష్ణ, పుప్పాల కృష్ణ బాబు, పుప్పాల రామారావు, రెడ్డి గోపి తదితర కొత్తపల్లి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.