తదేకం ఫౌండేషన్ సహకారంతో నిర్మించబోయే ఇంటి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో తమ్మవరం గ్రామంలో నిర్మించబోయే ఇంటి నిర్మాణ ప్రాంతాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీమతి మాదవి, శ్రీమతి సుధ, కాకినాడ రూరల్ జనసేన నాయకులు, తమ్మవరం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.