తదేకం ఫౌండేషన్ వారి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్: జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో కాకినాడ రూరల్ నియోజకవర్గం, సూర్యారావు పేట గ్రామంలో మత్స్యకార మహిళలకు స్వయం ఉపాధిలో భాగంగా కుట్టు శిక్షణ సెంటర్ ని సందర్శించి.. అనంతరం గ్రామంలోని వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణి కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ముఖ్య అతిధులుగా పాల్గొని లబ్దిదారులకు తదేకం ఫౌండేషన్ ప్రతినిధుల సమక్షంలో 7 ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు మల్లె భాస్కర్, ఎంపీటీసీలు ఓసుపల్లి రాజేశ్వరి రాము, ఎల్లబోయిన వీరదుర్గ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్, శాండీ, రాష్ట్ర సహా కార్యదర్శి తాటికాయల వీరబాబు, సోదే ముసలయ్య, గరికిన సురేష్, కరప మండల అధ్యక్షులు బండారు మురళి, దాసరి శివ, రెడ్డిపల్లి కిషోర్, నందిపాటి త్రిమూర్తులు, సుందర సతీష్, కర్ని శ్రీనివాస్, దుర్గ బాబు, జగన్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.