కౌలు రైతు ఏడుకొండలు ను పరమర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, పెద్దాపురప్పాడు గ్రామం వై. సావరం ప్రాంతానికి చెందిన కౌలు రైతు మేడిశెట్టి ఏడుకొండలు 10 ఎకరాలు కౌలు చేస్తూ నష్టపోయి అప్పులు పాలైపోయి ఏమిచేయలేని స్థితిలో ఇటీవల ఆత్మహత్యా ప్రయత్నం చేసారు.. ప్రాణాపాయ స్థితి లొ ఉన్న ఏడుకొండలు కాకినాడ సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విష్యం తెలుసుకొన్న జనసేన పార్టీ పి.ఏ.సీ సభ్యులు పంతం నానాజీ శనివారం ఆసుపత్రి కి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి, డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రదీప్, ప్రసాద్, శ్రీరాములు, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.