బాసూరు గ్రామంలో కవాతు.. భారీ బహిరంగ సభ

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు అధ్వర్యంలో.. బాసూరు గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ.. కవాతు.. భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి నియోజకవర్గ నాయకులు సత్తిబాబు మాట్లాడుతూ…ఈ సభకు విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు మరియు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ.. రైతాంగానికి అండగా జనసేన పార్టీ ఉంటుందని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల యొక్క కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతుల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు సొంత డబ్బును ప్రకటించిన ఘనత పవన్ కళ్యాణ్ ది అని.. 2024లో జనసేన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. జనసైనికులను ఉద్దేశించి మీ తల్లిదండ్రులతో ఓట్లు వేయించి పవన్ కళ్యాణ్ ని సీఎం చెసే బాధ్యత తీసుకోవాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి, ప్రచార కార్యదర్శి పాలూరు బాబు, ఎంపీటీసీ అంపిలి విక్రమ్, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు భూపతి అర్జున్, రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు, యూపీ రాజు. ఉత్తరాంధ్ర కోఆర్డినేట్ పైలా లక్ష్మి, గాజువాక వీర మహిళ శాలిని పాల్గొన్నారు.