క్రేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరగాలి: కొప్పల లావణ్యకుమార్

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డా:పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల ప్రకారం జిల్లా కార్యదర్శులు కొప్పల లావణ్యకుమార్, దాసు హేమకుమార్ మరియు నియోజకవర్గం నాయకుడు హేమసుందరం సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం, పిచ్చాటూరు, K.V.B పురం మండలాల్లో పర్యటించి కమిటీ విధివిధానాలు, పార్టీ నిర్మాణం గురుంచి జనసైనికులతో మాట్లాడటం జరిగింది. లావణ్యకుమార్ మాట్లాడుతూ క్రేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరగాలని, అందుకు అనుగుణంగానే అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే మండల అధ్యక్షులను నియమించారని, తొందరలో మండల కమిటీని వేయటం జరుగుతుందని, జనసైనికులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలమీద పోరాడాలని తెలియజేసారు. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు సుమన్, దేవ ప్రశాంత్, థామస్ నాయకులు చరణ్, సతీష్, గవాస్కర్, రామ్మూర్తి, రాజేష్ ,స్టీఫెన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.