NRI గండ్ల రమేష్ మరియు వారి టీం సభ్యులకు జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు: జోత్స్నా కటారి

చోడవరంకి చెందిన 10 సంవత్సరాల బాలుడు “కోలుకులూరి సంమిత్ మూర్తి” 11 KV విద్యుత్ లైన్ వలన షాక్ కు గురై 2 కాళ్లు మరియు చేయి కోల్పోయి శరీరం చాలా భాగం కాలిపోయి అతి దీన స్థితిలో ఉండడంతో USA కు చెందిన గండ్ల రమేష్ మరియు వారి టీం 45 వేల రూపాయల చెక్కును నా ద్వారా పార్టీ పెద్దలైన శ్రీ బొలిశెట్టి సత్య మరియు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ ల చేతుల మీదుగా జనసేన పార్టీ ఆఫీసులో బాలుడి తండ్రి శ్రీ శివరామరాజుకి అందించడం జరిగింది. ఈ బాలుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన గండ్ల రమేష్ మరియు వారి టీం సభ్యులకు జనసేన పార్టీ తరఫున
జోత్స్నా కటారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.