కార్పొరేటర్లను అభినందించి సత్కరించిన పార్వతి నాయుడు

గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మీ దుర్గ మరియు 47 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి యర్రంశెట్టి పద్మావతి కార్పొరేట్ ఎన్నికల్లో విజయం సాధించి 2 వసంతాలు పూర్తి చేసుకొని మూడవ వసంతంలో అడుగు పెట్టిన సందర్భంగా వారిని కలిసి అభినందించి సత్కరించిన మహిళా వింగ్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి బి.పార్వతి నాయుడు. ఈ సందర్భంగా పార్వతీ నాయుడు మాట్లాడుతూ ఇలాగే రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీని విజయబాటలో నడిపించాలని మహిళలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పార్వతీ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, తన్నీరుదానారావు, డేగల ఉదయచందర్రావు, కోన నాగార్జున, పద్మాకరావు, దాసరి వాసు, సంకటి హరి సుందరి, సామ్రాజ్యం, విజయ, పుష్ప, పద్మ మరియు జనసేన వీర మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.