మన్నా చర్చి సువార్త స్వస్థత సభలో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గంలోని 26 వ డివిజన్ మాలపల్లిలో శనివారపు పేట మన్నా చర్చి వారు నిర్వహించిన సువార్త స్వస్థత సభలో జీసస్ క్రీస్త్ ఫాలోవర్స్ పాస్టర్లు దైవజనులు శ్యామ్ సుందర్, విజయానందం, అబ్రహం, మోజేష్ మరియు సంఘస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ గతం నుండి మాకు ఉన్న సాన్నిహిత్యంతో ఈ కూడికలలో పిలిచిన దైవజనులు సంఘస్తులు మరియు ఇక్కడ ఉన్న పెద్దలు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఎంతోమంది దీనుల కోసం కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం, ప్రాంతం కోసం, నాయకత్వం కోసం, అధికారం కోసం నిరంతరం ఈ యొక్క ఆరాధనలో గుర్తు చేసుకుంటూ అనేకుల యొక్క బాధలు విముక్తి అయ్యేవిధంగా దైవజనులు చేస్తున్నటువంటి ఈ ఆరాధన ప్రార్థన ద్వారా ప్రియమైన యేసు క్రీస్తు వారి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని, మంచి పరిపాలన, మంచి ఆలోచన, అవగాహన హృదయం కలిగినటువంటి వ్యక్తులు ముందుకు రావాలని, మంచి సమాజం నిర్మాణం కావాలని, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీరు చేస్తున్న ఈ కూడికలు ఆరాధనలో గుర్తు చేసుకుని అనేకులకు మంచి సందేశాన్ని సువార్తను అందించి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నటువంటి దైవజనులకు ప్రభువులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం దైవజనులు సంఘస్తులు మతపెద్దలు రెడ్డి అప్పల నాయుడుని ఘనంగా సత్కరించి ఆయన ఉన్నతి కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, కొనికి మహేష్, సుందరనీడి శివశంకర్, తోట దుర్గా ప్రసాద్, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు.