మానకొండూరు పోలీసు స్టేషనులో జనసేన వినతి

తెలంగాణా, మానకొండూరు, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం మరియు దామోదర్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం పోలీస్ స్టేషన్లో పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలతో కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. వినతి పత్రాన్ని పూర్తిగా పరిశీలించి తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బండిపల్లి మారుతి, గొల్లపెళ్లి హరీష్ గౌడ్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.