అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొన్న పార్వతి నాయుడు

అమరావతి రాజధాని కోసం రైతులు అమరావతి నుండి అరసవెల్లి వరకు కొనసాగిస్తున్నటువంటి మహా పాదయాత్రలో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ మహిళా వింగ్ కోఆర్డినేటర్ శ్రీమతి బి పార్వతి నాయుడు పాల్గొని రైతులకు సంఘీభావం తెలపడం జరిగింది. అనంతరం మీడియా తో మాట్లాడుతూ జగన్ రెడ్డి కేవలం భూ ధందా కోసమే 3 రాజధానిలు డ్రామా ఆడుతున్నారు అని ఎద్దెవా చేసారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ దేశంశెట్టి సూర్య మరియు జొన్నపాడు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.