“జనం కోసం పవన్ – పవన్ కోసం మనం” మూడవ రోజు

కాకినాడ రూరల్, జనం కోసం పవన్ – పవన్ కోసం మనం మూడవరోజు ప్రచారంలో భాగంగా కాకినాడ రూరల్ 3 వ డివిజన్ చోడిశెట్టి సతీష్, వనమాడి మహేష్ ఆధ్వర్యంలో సంతనపురి కాలనీ, శెట్టిబలిజ పేట, ఎస్సి పేట గొడరిగుంటలలో ఇంటింటా ప్రచారం నిర్వహించి స్థానికుల సమస్యలు జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తెలుసుకోవడం జరిగింది. దోమల బెడద ఎక్కువగా ఉందని, అర్హులకు పెంక్షన్ ఇవ్వడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని, మహిళలు రేషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది రేషన్ తీసుకోవాలి అంటే ఒక పూట పని మానుకోవలసిన పరిస్థితి, కమ్యూనిటీ హాల్ ని సచివాలయంగా మార్చి వేశారని, పార్క్ ఉపయోగకరంగా లేదని, నాటుసారా అధికంగా అమ్ముతున్నారని, మహిళలు బయటకు రావడం కష్టంగా ఉందని స్థానికులు నానాజీగారికి తెలిపారు. మీరందరు ఆశీర్వదించి పవన్ కళ్యాణ్ ప్రజాప్రభుత్వంవచ్చేలా చూడండి, మీ కష్టాలు త్వరలో తీరుతాయని, స్మార్ట్ సిటీ నిధులు ఏమి చేస్తున్నారో, ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో తెలియడం లేదని, త్వరలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.