దివ్యాంగులకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండగా ఉంటారు: రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురంలో దివ్యాంగుల సోదర సోదరీమణులు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు గారిని కలిసి వారి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగుల సోదర సోదరీమణులను ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం లేదు. అప్పుడున్న ప్రభుత్వం అమలు చేసిన పెంక్షన్ మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారు. పెంక్షన్ ఏమీ పెంచలేదు. అప్పటికి ఇప్పటికీ నిత్యవసర సరుకులు, అన్ని చాలా పెరిగాయి దానికి అనుకూలంగా వీరిని ఆదుకోవాలి. ఇప్పటికైనా మేల్కొని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వీరిని ఆదుకోవాలి. దివ్యాంగుల సోదర సోదరీమణులు అందరికి అండగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉంటారు.