హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ చతుర్థ మహాసభకు 25,000 రుపాయల విరాళం

  • రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా కడప పట్టణంలో జనవరి 9వ తేదీన శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారి ఆశీస్సులతో జరిగే హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ చతుర్థ మహాసభకు కమిటి సభ్యుల కోరిక మేరకు తమ వంతు విరాళంగా రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు 25,000 రుపాయల విరాళంను ఇచ్చారు. ఈ విరాళాన్ని రాజంపేట ప్రముఖ విశ్రాంత ఉపాధ్యాయులు, పట్టణంలో అందరికీ సుపరిచితలైన సమ్మెట శివశంకర్ కుమారుడు, సమ్మెట శశిధర్ (హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ ఆర్థిక కార్యదర్శి)కి అందించారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు ఎప్పుడూ సహకరిస్తానని తెలిపారు. కమిటి సభ్యులు కురవ చంద్రశేఖర్, చామల సురేంద్ర, వేంకటదాసు, ప్రసాద్ రెడ్డి, కిరణ్ కుమార్, యాదవ్ శ్రీ హరి రావు, సల్లా వెంకటసుబ్బారెడ్డి యల్లటూరు శ్రీనివాస రాజుకి కృతజ్ఞతలు తెలిపారు.