పూతలపట్టు జనసైనికుడికి పవన్ కళ్యాణ్ చేయూత 50,000/-

పూతలపట్టు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసైనికుల కోసం ఏర్పాటుచేసిన ప్రమాద భీమా పథకం నుండి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలం జనసైనికుడు ఎం అజయ్ కి బుధ్వారం జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా 50వేల రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, కార్యదర్శి శివయ్య పూతలపట్టు మండల అధ్యక్షులు మనోహర్ పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం ప్రమాదభీమా చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఇది ప్రతి జనసైనికుడికి ఒక భరోసా కల్పిస్తుందని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తని కుటుంబ సభ్యుడిగా భావించి, వారి బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకొని అన్నివేళలా అండగా ఉన్నారని తెలియజేశారు. మూడవ విడత క్రియాశీలక సభ్యత్వం విజయవంతమైందని, ఈ కార్యక్రమంలో ప్రజలకు జనసేన పార్టీ మరింత దగ్గర అయిందని తెలియజేశారు.