పోలవరం జనసేన అద్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
పోలవరం నియోజకవర్గం, పోలవరం మండల గిరిజన గ్రామం కుంకాలలో యువత పండుగ రోజుల్లో జూదాలవెంట పడుకుండా జనసేన పార్టీ అద్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ ను పోలవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ చిర్రి బాలరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు గుణపర్తి చిన్ని, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, నియోజకవర్గ ఐటీ వింగ్ సభ్యులు ఆటపాకల వెంకటేశ్వరరావు అవ్, మండల ప్రధాన కార్యదర్శి కోటం లక్ష్మణ్, మామిడిపల్లి వరప్రసాద్, సుబ్బన్నదొర, మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.