టీం సైనిక జె.ఎస్.పి ఇండో ఎన్నారై జూమ్ సమావేశం

టీం సైనిక ఫౌండర్ అమీర్ ఖాన్ (సౌదీ అరేబియా) నేతృత్వంలో పాపోలు అప్పారావు (దుబాయ్ పారిశ్రామిక వేత్త, యుఏఈ జనసేన టీం లీడర్) అధ్యక్షతన శ్రీమతి రేఖా జివ్వాజీ (ఏపి జనసేన వీర మహిళా చైర్ పర్సన్), శ్రీమతి రత్నా పిల్లా (తెలంగాణ వీర మహిళా వైస్ చైర్ పర్సన్), శ్రీమతి రావి సౌజన్య (కృష్ణా పెన్నా రీజినల్ కోఆర్డినేటర్), శ్రీమతి రాయపాటి అరుణ (జనసేన పార్టీ అధికార ప్రతినిధి), బండి ప్రసాద్ (తెలంగాణ ఐటి కోఆర్డినేటర్), నల్లం శ్రీనివాస్ (జనసేన ప్రముఖ నాయకులు) లు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ఈ జూమ్ సెషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనసైనికులు, వీర మహిళలు మరియు నాయకులు పాల్గొని పార్టీ గ్రౌండ్ లెవల్ లో బలోపేతం చేసే దిశలో ఎదురవుతున్న సమస్యలు, అధికార పక్షం నుండి ఎదురవుతున్న సమస్యలు, దాష్టీకాలు, ఇంచార్జ్లు లేనిచోట ఏవిధంగా కేడర్ ను సమన్వయం చేసుకొని వెళ్ళాలి మరియు పార్టీ కార్యకర్తలకు వచ్చే ఎన్నికలకు ఏవిధంగా కష్ట పడాలి అనే అంశాల పై చర్చించటం జరిగింది. ఈ సమావేశంలో రాజంపేట ఇంచార్జ్ హరి రాయల్, నూజివీడు వీర మహిళా నాయకురాలు రామిశెట్టి తేజస్విని, ఒరిస్సా రాష్ట్ర జనసేన లీడర్ వి.ఎస్.ఎం శ్రీరామ్, విజయవాడ దుర్గ గుడి ధార్మిక మండలి మెంబర్, 5వ డివిజన్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి నిట్ల ఉమా మహేశ్వరి, ఆరుగోలను జనసేన లీడర్ బాదం నాని, టీం సైనిక గ్రూప్ లీడర్లు రాజమండ్రి నుండి సుధాకర్, ఒంగోలు నుండి పరుచూరి అవినాష్ నాయుడు, అమెరికా నుండి ఎన్నారై సాయి కృష్ణ తేజ(యు.ఎస్.ఏ, ఎం.ఎస్ విద్యార్ధి), దుబాయ్ నుండి రవి వర్మ, ముని కుమార్, కువైట్ నుండి టీం సైనిక లీడర్ విజయ్ గౌడ్, సౌదీ అరేబియా నుండి షాహిద్, గల్ఫ్ సేన నుండి నరసింహరావు, మంగళగిరి నుండి ఆల్ జె.ఎస్.పి నియోజకవర్గం గ్రూప్ లీడర్ మరియు టీం సైనిక గ్రూప్ ఎక్స్పర్ట్ గా సేవలనందిస్తున్న కొడాలి నాగ మల్లేశ్వరరావు, తణుకు నుండి మాధవ్ రాయుడు, తెలంగాణా వీర మహిళా విభాగం నుండి జనసేన పార్టీ ఎక్సిక్యూటివ్ మెంబర్ శ్రీమతి ప్రభావతి, కార్యదర్శులు శ్రీమతి అరుణ కుమారి, శ్రీమతి లక్ష్మీ మొలబంటి, శ్రీమతి నాగలక్ష్మి, జగ్గయ్య పేట నుండి శ్రీమతి శైలజ, శ్రీకాకుళం నుండి బాలరెడ్డి, నెల్లూరు 5వ డివిజన్ ఇంచార్జీ రేవంత్, అలేఖ్ పృథ్వీ, భాను, నాగరాజు, ఎస్.కె కంతార్, ఉత్తరాంధ్ర జనసేన టీం నుండి అల్లూరి రమేష్, సతీష్ తదితర జనసైనికులు, వీర మహిళలు, నాయకులు పాల్గొన్నారు. గెస్టులుగా వచ్చిన అతిథులు అందరూ టీం సైనిక చేసే ఆక్టివిటీస్ ను కొనియాడుతూ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చెయ్యటం జరిగింది.