తిరుపతిలో పవన్ కళ్యాణ్.. ప్రారంభమైన ప్యాక్ సమావేశం…

తిరుపతిలో జనసేన పార్టీ ప్యాక్ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పాటుగా ప్యాక్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అన్ని పార్టీల లక్ష్యంగా ఒక్కటే. అదే తిరుపతి ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో తమ బలం ఎంతవరకు ఉందనే దానిపై అధికార వైసీపీకి తెలియజేయాలనే యోచనలో ఉన్న జనసేన.. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే జనసేన తరపున తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల జాబితాను కూడా ఆ పార్టీ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నేడు తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్.. తిరుపతిలో పోటీ చేసే అంశంపై జనసేన శ్రేణులకు ఏ రకమైన క్లారిటీ ఇస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.