నేటి నుంచి తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్లు..

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న తిరుపతి ఉప ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభం కాబోతున్నది. ఈ నెల 30 వరకు నామినేషన్లు కొనసాగుతుంది. ఈనెల 31 వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. ఏప్రిల్ 17 వ తేదీన ఎన్నికలు, మే 2 వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుండటంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎంపిక దాదాపుగా పూర్తయినట్టుగా పార్టీ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నది. తిరుపతి పార్లమెంట్ స్థానంలో గెలవాలని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.