ఎక్సలెన్సీ అవార్డు రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్: మైలవరపు మణికంఠ

విశ్వకవి జాతీయ గీత సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదిన వేడుకలు సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు ను 2022 సంవత్సరానికి గాను.. తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మరియు అనేకమంది పెద్దల చేతుల మీదగా హృదయపూర్వకంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా మైలవరపు మణికంఠ మాట్లాడుతూ.. అవార్డు ను వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.. వర్ణిక ఆర్ట్ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ రంజిత్ గారికి ధన్యవాదాలు తెలియజేసి..
“ఈ అవార్డు నాకు రావడానికి గల ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన పార్టీ” అని తెలియ జేశారు.