ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ నువ్వే కాపాడాలి గోవిందా

తిరుపతి, జనసేన అధినేత పై కొంతమంది వైసీపీ కుట్ర దారులు పవన్ కళ్యాణ్ కి హాని కలిగించాలని చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా ఫలించకూడదని, ఆయనకు ఎలాంటి ప్రాణహాని జరగకూడదని శుక్రవారం అలిపిరి శ్రీవారి పాదాలచెంత జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, బాబ్జి హేమ కుమార్ సుమన్ బాబు, మునస్వామి, పగడాల మురళి, కొండ రాజమోహన్, వనజమ్మ, కీర్తన, లక్ష్మి, ఆనంద్, మనోజ్, కిషోర్, పార్దు, హిమవన్త్, సాయిదేవ్, హేమంత్, సాయి, బలరాం, రాజేశ్ ఆచారి, పురుషోత్తం, కోమల్, మరియు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కలు మొక్కుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఐపీసీని కాకుండా వైసిపిని ఫాలో అవుతుందని, ప్రశ్నించిన గొంతు నొక్కాలని చూస్తుందని పవన్ కళ్యాణ్ కు ఏ హాని కలగకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనపై ఉంటాయని, గత కొన్ని రోజులుగా ఆయనను టార్గెట్ చేస్తూ ఆయన పాల్గొన్న కార్యక్రమాలకు ఆటంకాలు కలిగిస్తూ ప్రత్యేకించి ఇంటి వద్ద రెక్కీలు నిర్వహించటం మంచి పద్ధతి కాదని, మమ్మల్ని దాటుకొని పవన్ కళ్యాణ్ వద్దకు మీరు వెళ్లాల్సి ఉంటుందని ఏ చిన్న హాని కలిగిన దానికి పూర్తి బాధ్యత జగన్ మోహన్ రెడ్డిదే అని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.