బిజెపి-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలి..!
తిరుపతి: బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎంగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ కోరారు.. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా మధ్య కిరణ్ మాట్లాడుతూ..
ఒక్క రాత్రిలో రాష్ట్ర రాజకీయ చర్చలు మారిపోయాయి..
ప్రజల్లో ఎవరికి ఓటు వెయ్యలో తెలియక అయోమయంలో ఉన్నారు..
బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎంగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలి..
బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా సోమవారం, మంగళవారం రెండు రోజులు ఏపీలో పర్యటిస్తున్నారు..
రాష్ట్ర స్థాయి కాదు ఢిల్లీ స్థాయి వ్యక్తులు ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి..
దీన్ని డిమాండ్ లేదా మా అబ్యర్ధన అయినా అనుకోవచ్జు..
ప్రజల్లో చాలా మందికి అర్థం కావడం లేదు ఎవరికి ఓటు వెయ్యలో..
ఈ రెండు రోజల పర్యటనలో నడ్డా ఎపి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి..
నాడు 2014 ఏపి ప్రచారంలో భాగంగా మోడీ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ను పువ్వుల్లొ పెట్టి చూసుకుంటారో.. లేక చెవులో పువ్వులే పెడతారో మీ ఇష్టం..
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పెద్ది రెడ్డి సపోర్ట్ లేకుండా గెలిచి ఆ తరువాత మా నాయకుడి గురించి మాట్లాడాలి.. అని కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు.. డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ..
రాష్ట్రం పూర్తిగా అంధకారంలో వెళ్ళిపోయింది..
జనసేన పార్టీ అధ్యక్షుడికి పదవి కాదు ఎపి అబివృద్ది ముఖ్యం..
నాడు సీనియర్ నాయకుడికి అవకాశం ఇచ్చాం..
అటు తరువాత ఒక్క అవకాశం ఇవ్వండి అని వచ్చిన నాయకుడు జగన్ కు అవకాశం ఇచ్చారు..
జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ పరిపాలనలో ప్రజలు చాలా అవస్థలు పడ్డారు..
రాష్ట్ర జిల్లా కమిటీ బిజెపి నడ్డాకు విన్నపం ఒక్కటే పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి..
బిజెపిలో సీఎం స్థాయి వ్యక్తులు లేరని వాళ్ళకే తెలుసు..
నేటి రాష్ట్ర రాజకీయాల పట్ల ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది..
ఈ పరిస్థితులను గమనించి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.. అని డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ తెలియజేశారు.