పాడేరు గడ్డపై జనసేన జండా ఎగరడమే లక్ష్యం

పాడేరు నియోజకవర్గం: పాడేరు మండలం కుజ్జేలి పంచాయితీ గడ్డంపుట్టు, గ్రామంలో గ్రామయువత పిలుపుమేరకు లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ పాడేరు మండల అధ్యక్షులు నఒదొలి మురళీకృష్ణ, సుర్ల సుమన్, సుబ్బరావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కిల్లో రాజన్ మాట్లాడుతూ, యువత రాజకీయాల్లోకి రావాలి సొసైటీ మీద యువతే బాధ్యత తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులు చట్టాలను మన ఓట్లతో గెలిచినా మన గిరిజన నాయకులు, పదవులకు డబ్బుకి కాక్కుర్తిపడి హక్కులను కాల రాస్తూ మన గిరిజన జాతి పొట్ట కొడుతున్నారని దుయ్యబట్టారు, సాటి జాతికి ఇంత అన్యాయం జరుగుతున్న పట్టి పట్టనట్టు వ్యవహరిస్తు జాతి అస్తిత్వాని తాకట్టు పెడుతున్నారని మండి పడ్డారు. యువత ముందుకొచ్చి మన హక్కులను మన చట్టాలను పూర్తి బాధ్యత తీసుకొని కాపాడుకుందాం. హక్కుల సాధన కోసం పోరాడి వారికి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని, కోల్పోయిన హక్కులు, జి ఓలు తిరిగి పునరుద్ధరించడం, ఉన్న జి ఓలను కాపాడటం జనసేనతోనే సాధ్యమని చెప్పారు. అందుకే యువత రాజకీయాల్లోకి ముందుకు వచ్చి కళ్యాణ్ గారికి అండగా ఉంది జనసేన పార్టీనీ గెలుపే లక్యంగా పార్టీ సిద్ధాంతాలను కళ్యాణ్ గారి అశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. పాడేరు గడ్డపై జనసేన జండా ఎగరడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దాం, హక్కులను కాపాడుకుందాం. మన సంపదను కాపాడుకుందాం, మా హక్కుల జోలికి వస్తే
ఖబడ్దార్, పోరాడి సాధించిన హక్కులను కొల్లగొడుతే చూస్తూ ఊరుకోం.. ప్రాణత్యాగాలు చేసైన జాతిని కాపడుకొంటం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేశారు.