Hyderabad: తమిళనాడు పోలీస్ ఆఫీసర్ ను అభినందించిన జనసేనాని

భారీ వర్షాలలో సైతం భారమైనా బాధ్యతను నెరవేర్చిన పోలీసు అధికారిణి రాజేశ్వరి చెన్నై తుఫాను సహాయక చర్యల్లో సృహ కోల్పోయిన వ్యక్తిని తన భుజంపై వేసుకొని ఆటోలో ఆసుపత్రికి తరలించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు.

ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జనసేన పార్టీ వీరమహిళా విభాగం స్పందించింది. ఆమెకు వీరమహిళా విభాగం తరుపున సెల్యూట్ అంటూ ట్విట్టర్ లో అభినందనలు తెలిపింది. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ఆమెను కొనియాడారు.