బెళుగుప్ప జనసేన ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఉరవకొండ, బెళుగుప్ప మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా స్థానిక నగరేశ్వర అలయంలోని ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద కేక్ కటింగ్, కార్యక్రమం తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ బెలుగుప్ప మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్ మాట్లడుతూ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పాటు పడే వ్యక్తి అని ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ గల నాయకుడు అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చాలా అవసరం అని కాశంశెట్టి సుధీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధు, క్రిష్ణ, నాని, తిప్పయ్య, శేఖర్, వరుణ్, మల్లికార్జున, అజయ్, అభి, మణి, గణేష్, మనోజ్, నాగరాజు, మహేష్, రవి నాయక్, శివ, నాగ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.