డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామంలో జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత మెడికల్ క్యాంపు నిమిత్తము దాదాపు ఎనిమిది వందల మందికి పైగా ఉచితంగా సేవలను వినియోగించుకొని బిపి, షుగర్ పరీక్షలు చేయించుకుని, మందులు ఉచితంగా స్వీకరించడం జరిగింది. ఉప్పాడ మత్స్యకార సోదరులు ఈ సేవలను బాగుగా ఉపయోగించుకోవడం జరిగింది. డాక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన అనేది ఒక సేవ అని ప్రజలకు సేవ చేసే భాగ్యం దేవుడు మాకు ఇచ్చినందుకు జనసేన పార్టీ తరపు నుంచి ఇంకొంచెం ముందుకెళ్లి సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉప్పాడ మత్స్యకార సోదరులు నా దగ్గరికి రావడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వైరల్ ఫీవర్స్ వల్ల బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. అదే సమయంలో తన మనసులో కూడా ఉప్పాడ గ్రామం నందు ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టాలని ఆలోచన ఉండటం జరిగింది. అది ఈ రోజున ఇంతమందికి నిజంగా సేవనందించినందుకు నాకు సంతోషకరంగా ఉందని డాక్టర్ శ్రీధర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి రాజు, చిన్న శశిధర్, పలివెల నాని బాబు, సొడే రవికుమార్, ఆకుల లావరాజు, వంక జాన్ ప్రసాద్, పెనుపోతుల వీరబాబు, పల్లెటి జాన్సన్, మైలపల్లి రవి, గంపల సత్తిరాజు, వంకా కొండబాబు, చింతకాయల పూరి, మైలపల్లి రాజు, మెరుగ రవికుమార్, షోడే మహేష్, జ్యోతుల శివ, జి వెంకటరావు, రాశిపల్లి రమణ మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.